Showing posts with label Holy Places in Coastal Andhra. Show all posts
Showing posts with label Holy Places in Coastal Andhra. Show all posts

శ్రీ రంగనాథ స్వామి (నెల్లూరు )

                                                        శ్రీ రంగనాథ స్వామి (నెల్లూరు )
మన దేశoలో చాల కొద్ది ఆలయాలలో మాత్రమే శ్రీమహావిష్ణువు ఆదిశేషునిపై పవలిస్తునట్టుగా దర్సన మిస్తాడు.అలాంటి కొద్ది ఆలయాలలో నెల్లూరులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఒకటి.


 అందుకే కాబోలు ఘంటసాల గారు ఒక గీతంలో
                                                               నెల్లూరి సీమలో చల్లంగా శయనించు శ్రీ రంగనాయక! ఆనందదాయక! అని పాడారు.
రంగనాయక స్వామి ఆలయ సముదాయం మరియు ఆకర్షనీయమైన గాలి గోపురం 
                                     
ఇక ఈ ఆలయం  విషయానికి వస్తే ఇది నెల్లూరు జిల్లాలో పెన్నా నది ఒడ్డున ఉంది.నెల్లూరు పట్టణం మన  రాష్ట్రంలోని  అభివృద్ధి చెందిన పట్టణాలలో ఒకటి.కాబట్టి ఈ ప్రాంతంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను ఈలాంటి అసౌకర్యం కలగకుండా దర్శించవచ్చు.
బస్సు మరియు రైల్ సౌకర్యాలు ఈ ఆలయాన్ని చేరుకోవటానికి పుష్కలంగా ఉన్నాయి.
ఈ ఆలయానికి గాలిగోపురం ఒక ప్రత్యెక ఆకర్షణ.ఇది దాదాపు 80 అడుగుల ఎత్తు ఉంటుంది.
స్థల పురాణం: ఒకసారి శ్రీమహావిష్ణువు ఏకాంతంగా గడపడానికి అనువైన ప్రాంతంలో ఆదిశేషువును ఒక కొండగా మరమని అజ్నాపించగా అతను అలా కొండగా మారి ఇప్పటి రంగనాథుడు కి నివాసయోగ్యంగా మారాడు.ఈ కారణం చేతనే ఈ కొoడను తల్పగిరి  అంటారు.కొంతకాలం స్వామి శ్రీదేవి తో ఏకాంతంగా గడిపాక వైకుంటానికి తిరిగి ప్రయాణమయ్యాడు.స్వామి కొంతకాలం ఇక్కడ ప్రత్యక్షం గ గడిపిన కారణంగా ఇది  ఎంతో పవిత్రమైన ప్రాంతంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని పల్లవులు క్రీ.శ 6 7 వ శతాబ్దంలో నిర్మించారని అధరులు ఉన్నాయ్.
ఈ ప్రాంతానికి,ఈ ఆలయానికి చాలామంది రాజులూ వచ్చారని వారు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు మరియు విశేష విరాళాలు ఇచ్చారని ఇక్కడి ధ్వజ స్థంభం పై లిపి ద్వారా తెలుసుకోవచ్చు.
ఆలయం లోపలి అద్బుత కట్టడాలు 


ఇక్కడి ముఖమండపం అప్పటి రాజమహేంద్రవరం  రాజైన రాజరాజనరేంద్రుడు నిర్మించాడు.జాత వర్మ సుందర పాండ్య అనే రాజు ఇక్కడి స్వామి వారికి వీరాభిషేకం నిర్వహించాడు.అంతేగాక ఎన్నో భూములను స్వామి వారికి కానుకగా ఇచ్చాడు.ఎంతో చారిత్రక మరియు పురాణ ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయాన్ని అందరు తప్పకుండ దర్శించాలి.
రంగనాథ స్వామి దర్సించాలంటే మనమంతా ముందు తమిళనాడు లోని ఆలయాల గురించి ఆలోచిస్తాము.ఈ ఆలయాన్ని దర్సించాక తమ ఆలోచనను మార్చుకుంటారని ఆశిస్తున్నాను.    
      .

మంగళగిరి పానకాల స్వామి

                                                                  మంగళగిరి పానకాల స్వామి 
కొండపై ఉన్న పానకాల నరసింహ స్వామి ఆలయ సమూహం


దేవుని ముందు పెట్టిన ప్రసాదాన్ని దేవుడు తింటే అది చూసి పులకించని భక్తులు ఉండరు.కానీ అల ఎక్కడైనా జరుగుతుందా అంటే ఆ ప్రశ్నకు సమాధానము మంగలగిరి శ్రీ పానకాల నరసింహ స్వామి. ఈ విషయాన్ని   వివరంగ తెలుసుకునే ముందు ఇక్కడి స్థల పురాణాన్ని కాస్త తెలుసుకుందాము.
 ఈ క్షేత్రం విజయవాడ మరియు గుంటూరు కు అతి చేరువలో ఉంది.విజయవాడ నుంచి ప్రతి 10 నిమిషాలకు గుంటూరు కు బస్సు సౌకర్యం కలదు. ఆ మార్గ మధ్య లోనే ఈ ఆలయం కలదు.
మన రాష్ట్రము లోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బస్సు లేదా రైల్ ప్రయాణం ద్వారా ఈ ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు.మీకు ఈ ఆలయ సందర్శనార్ధం ఎలాంటి సమాచారాన్నైనా అందిచటానికి మా బ్లాగ్ సిద్ధoగా ఉంది. 
స్థల పురాణం:ఇక్కడ రెండు రకాలైన కథలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి.
వాటిలో మొదటిది 
పూర్వం ఈ ప్రాంతాన్ని పారియాత్ర అను రాజు పాలించేవాడు.అతనికి సంతానము లేకపోవుటచే, సంతానం కొరకు దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను తిరిగగా అతనికి ఒక శిశువు జన్మించాడు.అతనికి హస్తసృంగి అని పేరు పెట్టాడు. కానీ దురదృష్టవసాత్తు అ పిల్లవాడు అoగవికలాంగుడిగా  జన్మించాడు.ఆ  రాజు తన పుత్రుని చూసి చాల విచారపడ్డాడు.తండ్రి బాధ  చూసి హస్తసృంగి బాధాతప్త హృదయంతో అడవులకు వెళ్లి భగవంతుని సాక్షాత్కారం కోసం ఘోరమైన తపస్సు చేసాడు.అంతట  శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవగా హస్తసృంగి తనకు తన జీవితాంతం భగవంతుని పాదాల చెంత  ఉండాలని ఉండాలని చెప్పగా, శ్రీమహావిష్ణువు హస్తసృంగిని ఒక కొండగా మార్చివేసి దానిపై శ్రీమహావిష్ణువు నరసింహ అవతారం లో కొలువయ్యాడు.అదియే ఇప్పటి  పానకాల నరసింహస్వామి ఆ లయం.
మరియొక కథ కూడా ఈ ఆ లయంగూర్చి అందుబాటులోఉంది.మహిషాసుర వధ  జరిగిన తరువాత  దుర్గమ్మ  ఆ గ్రహాగ్నితో రగిలిపోయింది. అప్పుడు ఆమె అగ్ని తన రెండవ కంటి ద్వార ఒక కొండపైకి  వదిలి ఆ కొoడను పెళ్ళగించి గాలిలోకి విసిరివేసింది. అదియె ఇప్పటి నరసింహ స్వామి కొలువైన కొండ.కాని దుర్గమ్మ నుంచి వెలువడిన  ఆ  అగ్నిజ్వాలలు మాత్రం ఆ కొండ నుండి అలాగే వెలువడుతున్నాయి.తరువాతి కాలంలో నరసింహ స్వామి హిరణ్యకసిపున్ని చంపిన  తరువాత  అలాంటి అగ్నిజ్వాలల  తోనే రగిలిపోయాడు.అప్పుడు ప్రహ్లాదుడు ఆయనను స్తుతించగా ప్రసన్నుడై తన  నుంచి వెలువడుతున్న అగ్నిజ్వలను తను అదుపుచేసుకోదలచి అనువైన ప్రాంతాన్ని వెతకుచున్న సమయంలో అప్పటికే అగ్నితో రగులుతున్న ఈ కొండ కనిపించి అక్కడే తనకు అనువైన ప్రాంతo అని తలచి  నరసింహ స్వామి ఇక్కడే  కోలువైయ్యాడు.కొండ కనిపించి అక్కడే తనకు అనువైన ప్రాంతo అని తలచి  నరసింహ స్వామి ఇక్కడే  కోలువైయ్యాడు.కాని అగ్ని జ్వాలలు మాత్రం చల్లారలేదు.
బ్రహ్మదేవుడు ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామిని పానకంతో అభిషేకించగా అగ్నిజ్వాలలు పూర్తిగా ఆరిపోయాయి. అప్పటినుంచి ఇక్కడ పానకంతో  అభిషేకించడం ఆనవాయితీగా మారింది.ఇక్కడ చెప్పుకోతగ్గ విశేషం ఏమిటంటే స్వామి భక్తులు ఇచ్చిన పానకాన్ని అర్చకులు స్వామి నోటిలో పోస్తే నరసింహుడు పానకాన్ని  గుటకలు వేస్తూ సంతోషంగా స్వీకరిస్తాడు.గుటకలు వేసిన శబ్దం కూడా స్ఫష్టంగా వినిపిస్తుంది.స్వామికి భక్తులు ఇచ్చిన పానకాన్ని అర్చకులు స్వామి కి అందివ్వగా స్వామి దానిని త్రాగి మరల కొంత పానకాన్ని బయటకు వదులుతాడు.దానినే భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు.మరియొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ నిరంతరం పానకం నైవేద్యం వళ్ళ అక్కడ పానకం నేలపై పడినా అక్కడ ఒక్క చీమ కూడా ఉండదు మరియు ఒక ఈగ కూడా వాలదు.     భగవంతుడుకి ఇచ్చిన ప్రసాదాన్ని భగవంతుడే తింటే వచ్చే అలౌకిక ఆనందాన్ని భక్తులు సొంతం చేసుకుంటారు. ఇది ప్రతి తెలుగువాడు కచ్చితంగా చూడదగ్గ ప్రాంతం.
                  
 లక్ష్మినారాయణ  స్వామి  బ్రహ్మోత్సవం: 
 స్వామి బ్రహ్మోత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి.ప్రతి ఏట ఇవి ఫాల్గుణ శుద్ధ షష్టి నుంచి మొదలుకొని 11 రోజులు జరుగుతాయి.ఈ మా బ్రహ్మోత్సవాలను ధర్మరాజు ప్రారంభిచాడని ఒక నమ్మకం.శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు తన పుట్టినరోజు వేడుకలని ఇక్కడ జరపమని కోరగా, శ్రీకృష్ణుడు ఆ పనిని ధర్మరాజు కు అప్పగించాడు.అప్పటినుంచి ఇక్కడ నిర్విగ్నంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.
స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు 

క్షీర వృక్షం:
పూర్వం శశిబంది అనే రాజు నారదుని సలహా మేరకు దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలని సందర్శించమని చెప్పగా అతను  తన రాజ్యాన్ని వదలి తీర్థయాత్రలకు వెళ్ళాడు.అయన సతీమణి తనకు స్త్రీల కష్టాలను బాధలను తీర్చి వారికి సంతన భాగ్యం కలగించే వరాన్ని ఇవ్వమని కోరగా, \అప్పుడు నారదుడు అ రాణిని క్షీర వృక్షంగా మార్చాడు.ఆ వృక్షం ఇప్పటికి స్త్రీలకు  దైవంగా మరియు సంతన వృక్షం గా అలరారుతోంది. 
క్షీర వృక్షం 

స్వామి  ఆలయానికి  సంబందిoచిన ఈ క్రింది వీడియో తిలకించండి...




          

మందపల్లి

                                                                    మందపల్లి 
ఆలయ ముఖ ద్వారము 
                                                        


శనిగ్రహ భాధలను గురించి మనకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.శనిగ్రహ పీడితులైన వారి భాదలను తీర్చడానికి శనీశ్వర క్షేత్రాలు కొన్ని మనదేశం లో వెలసాయి.అటువంటి  క్షేత్రాలలో ఒకటై మరియు మన రాష్ట్రంలో గల ఎకైక శనిక్షేత్రంగా  వెలుగొoదుతున్న మందపల్లి క్షేత్రం గురించి దాని ప్రాముఖ్యతను గురించి తెలుసుకుoదాం.



మందపల్లి శనీశ్వరుడు
  ఈ క్షేత్రానికి హైదరాబాద్ నుండి విజయవాడ నుండి వైజాగ్ నుండి మరియు అన్ని ముఖ్య పట్టణాల నుండి యాత్రికులు రావటానికి అన్ని రకాల బస్సు సౌకర్యాలు ఉన్నాయి.రైల్ ద్వారా చేరుకోదలచిన వారు కాకినాడ లేదా రాజమoడ్రిలో దిగి అక్కడ నుండి బస్సు లో చేరుకోవచ్చు.
స్థల పురాణం : ఒకసారి మహాశివుడు మరియు శని సంభాషనలాడుకోనుచుండగా , శివుడు తనకు శని పీడ ఉండబోదని ఎందుకంటె తాను ఈ ప్రపంచానికి లయ కారకుడినని చెప్పాడు. దానికి శని అంగీకరించలేదు.వారిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై అది చివరకు బల పరీక్ష దాక వెళ్ళింది.


ఆలయ ఆవరణం 
మందపల్లి శనీశ్వరుడు 

       
అప్పుడు శివుడు నేను నీకు రేపు ఉదయం వరకు సమయం ఇస్తున్నాను.నీ ప్రభావాన్ని నాపై ప్రసరించు అని అన్నాడు.తరువాతి రోజు ఆ మహాశివుడు శని పీడ నుండి తప్పిoచుకొనటానికి ఒక కీకారణ్యంలో పొదల మధ్యన దాక్కొన్నాడు.తరువాతి రోజు సూర్యోదయం కాగానే అక్కడనుండి బయటకు రాగా శని తానై బల పరీక్ష లో నగ్గినట్టుగా ప్రకటించాడు.శివుడు కోపంతో తనపై శని ప్రభావం అసలు పడలేదని కాబట్టి తనేనగ్గనన్నాడు.అందుకు శని మహాశివ ఈ ప్రపంచానికే లయకారకుడైన శివుడు కేవలం శని పీడను  తప్పిoచుకొనటానికై ఒక అడవిలో గడిపాడు కాబట్టి తానే నగ్గినట్టు ప్రకటించాడు.ఆ మహాశివుడు శని సమయస్పూర్తి కి మిక్కిలి సంతోషించి అతనికి  శివుడు తన ఆత్మలింగాన్ని ఇచ్చాడు.ఆ ఆత్మలింగాన్ని శనిదేవుడు ఎంతో భక్తి తో పుజించానారంభించాడు.ఆ శివలిoగేమె ఈ మందపల్లి శనీశ్వరుడిగా ప్రసిద్ధి కెక్కాడు. 
ఇక్కడి  శనీశ్వరుడికి భక్తులు తమకు శనిభాధలు తొలగి పోవాలని తైలాభిషేకం చేస్తుంటారు. శనిదేవుడికి  ఎంతో ఇష్టమైన నీలి వస్త్రాలతో శివలిoగాన్ని కప్పుతారు.
శని భాధలను అనుభవిస్తున్న వారె కాక అందరు ఈ క్షేత్రాన్ని దరించి తరిoచ ప్రార్ధన.   
ఈ పై ఆర్టికల్ ఫై మీ సలహాలను మరియు అభిప్రాయాలను దయచేసి క్రిందున్న బాక్స్ లో రాసి మాకు దిశా నిర్దేశo  చేయ ప్రార్ధన.
అందమైన ప్రకృతి 
ఆలయ ఆవరణం 








featured-content

Social Icons

Ads 468x60px

Social Icons

Featured Posts